News January 28, 2025
ఈనెల 31న ధర్మశ్రీ ప్రమాణ స్వీకారం

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈనెల 31న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు స్థానిక పట్టణ అధ్యక్షులు ఎం.జానకిరామ్ సోమవారం తెలిపారు. కసింకోట మండలం తేగాడలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మనసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
Similar News
News November 15, 2025
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం జడ్పీ స్కూల్ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చూడాలని, పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి పిలిపించాలని తెలిపారు. పది విద్యార్థులకు బోధించే టీచర్లకు అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వొద్దని HMకు సూచించారు.
News November 15, 2025
పాఠశాలల అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రతి అధికారికి రెండు పాఠశాలలు కేటాయించి, పనుల పురోగతిని పరిశీలించాలన్నారు. వినియోగంలో లేని ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల వివరాలను నవంబర్ 22లోపు పూర్తిచేయాలని సూచించారు. విద్యా సంస్థల మౌలిక వసతుల కోసం రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 15, 2025
MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

మహబూబ్నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.


