News January 28, 2025
ఈనెల 31న ధర్మశ్రీ ప్రమాణ స్వీకారం

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈనెల 31న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు స్థానిక పట్టణ అధ్యక్షులు ఎం.జానకిరామ్ సోమవారం తెలిపారు. కసింకోట మండలం తేగాడలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మనసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
Similar News
News November 24, 2025
అది మీ తప్పు కాదు

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ లోపాల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
News November 24, 2025
ముగిసిన ఐబొమ్మ రవి విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి 5 రోజుల పోలీసు విచారణ ముగిసింది. స్నేహితుడు నిఖిల్తో కలిసి రవి డేటా హ్యాండ్లింగ్, సర్వర్ యాక్సెస్ వంటి అంశాల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు, USDT చెల్లింపులు, APK లింక్స్తో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
News November 24, 2025
సిరిసిల్ల: ‘అర్హులందరికీ వెంటనే పదోన్నతులు కల్పించాలి’

అర్హులైన సెస్ ఉద్యోగులందరికీ వెంటనే పదోన్నతి కల్పించాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్ల సెస్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. పదోన్నతులు కల్పించడంలో ఆలస్యం చేయడంతో అర్హులైన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.


