News January 28, 2025
ఈనెల 31న ధర్మశ్రీ ప్రమాణ స్వీకారం

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈనెల 31న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు స్థానిక పట్టణ అధ్యక్షులు ఎం.జానకిరామ్ సోమవారం తెలిపారు. కసింకోట మండలం తేగాడలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మనసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
Similar News
News December 5, 2025
గద్వాల్: పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరం

గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన, బాలికల ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
News December 5, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ/కెమికల్ /కంప్యూటేషనల్ & ఇన్ఫర్మేషన్ /ఫార్మాస్యూటికల్/వెటర్నరీ విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nii.res.in
News December 5, 2025
అందుకే IPLకు గుడ్బై చెప్పా: ఆండ్రీ రస్సెల్

వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ IPLకు <<18429844>>గుడ్బై<<>> చెప్పిన కారణాన్ని తాజాగా వెల్లడించారు. “ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద టోర్నీ. ప్రయాణాలు, వరుస మ్యాచ్లు, ప్రాక్టీస్, జిమ్ వర్క్లోడ్ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం సవాలుతో కూడుకున్నది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ నేను ప్రభావం చూపాలి. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా కొనసాగాలని అనుకోవడం లేదు” అని తెలిపారు.


