News May 5, 2024

ఈనెల 6న రేపల్లెలో సీఎం జగన్ పర్యటన

image

ఈనెల ఆరోతేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపల్లె వస్తున్నారని, రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేశ్ తెలిపారు. రేపల్లె తాలూకా సెంటర్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ అభిమానులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు సీఎం జగన్ పర్యటన విజయవంతం చేయాలని డాక్టర్ గణేశ్ కోరారు.

Similar News

News April 22, 2025

అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష

image

వచ్చే నెల 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు.. సోమవారం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ పాల్గొన్నారు. పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రాంగణం, రహదారి అభివృద్ధి, భద్రత ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ప్రధాని బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని అంచనా వేశారు.

News April 22, 2025

గుంటూరు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ 

image

రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్న తరుణంలో గుంటూరు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 150 పరీక్షా కేంద్రాల్లో 29,459 మంది రెగ్యులర్, ప్రైవేటుగా మరో 961 మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ఆశలతో పరీక్షలు రాశారు. ఇప్పుడు ఫలితాల వేళ… ఒక్కో సెకనూ గంటలా మారింది. ప్రతి ఒక్కరికీ తమ ఫలితం మీద ఎన్నో ఆశలు.. ఎన్నో లక్ష్యాలు.. పెట్టుకుని ఉన్నారు. రిజల్ట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.

News April 21, 2025

గుంటూరు: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ను సోమవారం విడుదల చేసింది. పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి పేపరు 70 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన సబ్జెక్టులుగా టీచర్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్, వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటాయి. విద్యార్థులు పరీక్ష తేదీలను గమనించాలని సూచించారు.

error: Content is protected !!