News February 3, 2025

ఈనెల 6 మంత్రి ఫరూక్ సమీక్ష

image

రాష్ట్రంలో న్యాయశాఖ సంబంధించిన పాలనాపరమైన వివిధ అంశాలపై ఈనెల 6వ తేదీన సమీక్ష చేస్తున్నట్లు సోమవారం మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచి ఏర్పాటుకు సంబంధించిన కార్యచరణ విషయంపై కూడా న్యాయశాఖ కార్యదర్శితో చర్చించడం జరుగుతుందని మంత్రి ఫరూక్ వెల్లడించారు.

Similar News

News November 17, 2025

మీ తీరు కోర్టు ధిక్కారమే.. TG స్పీకర్‌పై SC ఆగ్రహం

image

TG: MLAల కేసులో స్పీకర్ తీరుపై SC ఆగ్రహించింది. ‘వారిపై నిర్ణయం తీసుకుంటారా? ధిక్కారం ఎదుర్కొంటారా? మీరే తేల్చుకోండి’ అని CJI గవాయ్ స్పష్టంచేశారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకరే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన తీరు కోర్టు ధిక్కారమేనన్నారు. ఆ MLAలపై వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గడువులోగా విచారణ పూర్తిచేస్తామని స్పీకర్ తరఫున రోహత్గీ, సింఘ్వీ తెలిపారు.

News November 17, 2025

ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు!

image

రంజీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా 8 వికెట్లతో రాణించారు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తొలి 5 వికెట్లను పడగొట్టిన శుక్లా, మొత్తంగా 20 ఓవర్లలో 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశారు. అతడి దెబ్బకు హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111 రన్స్‌కే ఆలౌటైంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టారు.

News November 17, 2025

తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఫోన్ హ్యాక్

image

తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆమె మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌కి సందేశాలు పంపిస్తూ డబ్బులు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై భువన సుందరి స్పందిస్తూ.. తమ పేరుతో వచ్చే ఎలాంటి సందేశాలకు స్పందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు పంపించి ఎవరూ మోసపోవద్దన్నారు.