News February 5, 2025

ఈనెల 7న బుద్ధవనంలో ‘త్రిపీటక పఠనోత్సవం’

image

నాగార్జునసాగర్ హిల్ కాలనీ బుద్ధవనంలో ఈనెల 7న మహాబోధి సొసైటీ సికింద్రాబాద్, అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి ఆధ్వర్యంలో త్రిపీటక పఠనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బౌద్ధ ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 200 మంది బౌద్ధ బిక్షువులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 8, 2025

నల్గొండ: కలెక్టరేట్‌లో పందులు.. 

image

జిల్లాలోని కలెక్టరేట్ ఆవరణలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయ్. నిత్యం వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఇవి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కలెక్టరేట్‌లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా ప్రదేశాల్లో పందుల బెడద ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

News February 8, 2025

నల్గొండ: మాతా శిశుమరణాల రేటు తగ్గింపును సవాల్‌‌గా తీసుకోవాలి: కలెక్టర్

image

మాతా శిశుమరణాలను తగ్గించడాన్ని సవాల్‌గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించి అన్ని రంగాలలో మనిషి ముందుకెళ్తున్నప్పటికీ అవగాహన లోపం, మూఢ నమ్మకాలతో అక్కడక్కడా ఇంకా మాతా శిశు మరణాలు నమోదవుతున్నాయని అన్నారు.

News February 8, 2025

నల్గొండ: యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య

image

మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలో వాణి అనే యువతి బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సతీశ్ కొద్దిరోజులుగా వాణిని వేధిస్తున్నాడు. ఈ కారణంతోనే తమ బిడ్డ ఈ దారుణానికి ఒడిగట్టిందని కుటుంబీకులు తెలిపారు. దీంతో సతీశ్‌పై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!