News February 5, 2025
ఈనెల 7న బుద్ధవనంలో ‘త్రిపీటక పఠనోత్సవం’

నాగార్జునసాగర్ హిల్ కాలనీ బుద్ధవనంలో ఈనెల 7న మహాబోధి సొసైటీ సికింద్రాబాద్, అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి ఆధ్వర్యంలో త్రిపీటక పఠనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బౌద్ధ ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 200 మంది బౌద్ధ బిక్షువులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 9, 2026
NLG: మున్సిపల్ పోలింగ్.. రెండు రోజులు సెలవులు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
News February 9, 2026
నల్గొండ: ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ పూర్తయింది. సోమవారం కలెక్టరేట్లో జిల్లా సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నల్గొండ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, చండూరు వంటి మున్సిపాలిటీల్లోని 475 పోలింగ్ కేంద్రాలకు మొత్తం 2,855 మంది సిబ్బందిని (20% రిజర్వ్తో కలిపి) కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
News February 9, 2026
ఎన్నికలకు సిద్ధం.. సిబ్బంది ఖరారు: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలకమైన చివరి విడత ర్యాండమైజేషన్ సోమవారం కలెక్టరేట్లో పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. NLG కార్పొరేషన్ సహా MLG, నందికొండ, హలియా, DVK, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల్లో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


