News May 4, 2024

ఈనెల 9న చీపురుపల్లికి చంద్రబాబు 

image

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 9న చీపురుపల్లిలో నిర్వహించే ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ఆ పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందిందన్నారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు చీపురుపల్లి పట్టణంలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News November 22, 2025

SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

image

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

News November 22, 2025

ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.

News November 22, 2025

ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.