News September 24, 2024

ఈపీడీసీఎల్ అధికారులతో MP శ్రీభరత్ సమీక్ష

image

ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజనలో మరింత మంది లబ్ధిదారులను చేర్చాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ సూచించారు. సోమవారం ఆయన ఈపీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరితగతిన అండర్ గ్రౌండ్ సిస్టం పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 24, 2025

విశాఖలో హోంగార్డు అనుమానాస్పద మృతి.!

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న హోంగార్డు బి.కృష్ణారావు (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన ఆయన కాసేపటికే విశాఖలోని 104 ఏరియా రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

News November 24, 2025

విశాఖ తీరంలో విషాదం.. మరో మృతదేహం లభ్యం

image

విశాఖ లైట్ హౌస్ బీచ్‌లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఘటన విషాదాంతమైంది. ఆదివారం తేజేశ్ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం ఆదిత్య మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. సముద్ర స్నానానికి దిగి అలల ధాటికి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News November 24, 2025

బిజీబిజీగా విశాఖ పోలీసుల షెడ్యూల్

image

విశాఖలో పోలీసు యంత్రాంగం బిజీ బిజీ షెడ్యూల్‌తో విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం CII సమ్మెట్ సభలును విజయవంతంగా విధులు నిర్వహించిన‌ పోలీసులకు వరుసగా మూడు కార్యక్రమాలు జరగనున్నడంతో సవాల్‌గా మారింది. కనకమాలక్ష్మి దేవస్థానం పండుగ ఉత్సవాలు. మేరీ మాత ఉత్సవాలు, ఇండియా-సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలుతో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.