News August 27, 2024

ఈవీఎంలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: మాజీ ఎంపీ బెల్లాన

image

తమ ఫిర్యాదు మేరకు అధికారులు నిర్వహించిన ఈవీఎంల తనిఖీలు సంతృప్తికరంగా లేవని.. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలలో డేటా డిలీట్ చేశారని, మాక్ పోలింగ్ నిర్వహణకు తాము ఒప్పుకోలేదన్నారు. తాము లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించలేదని దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

Similar News

News November 16, 2025

చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా చూసుకోవాలి: డా.వెంకటాచలం

image

చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహారాజా సర్వజన ఆసుపత్రి డెర్మటాలజీ హెచ్ఓడీ డా.వెంకటాచలం ఆదివారం తెలిపారు. శరీరం పొడిబారకుండా చూసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగకూడదన్నారు. స్నానం చేసిన వెంటనే గ్లిజరిన్ ఆయిల్ లేదా కొబ్బరినూనె రాసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.

News November 16, 2025

ఈ ఏడాది 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం: మంత్రి

image

జిల్లాలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి రైతు తన పంటను అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. గత ఏడాది 3.34లక్షల వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు.

News November 16, 2025

గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కరించిన తర్వాత SMS ద్వారా సమాచారం చేరవేస్తామని తెలిపారు.