News September 27, 2024
ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్
ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్ను కలెక్టర్ రంజిత్ బాషా శుక్రవారం పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘాలో ఈవీఎంలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సంబంధిత రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. ఆయనతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఉన్నారు.
Similar News
News October 10, 2024
నంద్యాల: కొబ్బరి బొండంపై నవదుర్గల చిత్రాలు
ఆళ్లగడ్డకు చెందిన ఆర్టిస్టు విజయ్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా కొబ్బరి బొండంపై నవదుర్గ మాతల చిత్రాలను అక్రిలిక్ రంగులతో తీర్చిదిద్దారు. ఆది పరాశక్తి జగజ్జనని 9 రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహా గౌరి, సిద్ధిధాత్రి అమ్మవార్ల చిత్రాలను చిత్రీకరించారు.
News October 10, 2024
నంద్యాల చిత్రకారుడి ప్రతిభ.. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపం
నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ మరోసారి తన టాలెంట్ చూపెట్టారు. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపాన్ని చిత్రీకరించి అబ్బురపరిచారు. బాబాపై ఉన్న భక్తి, ప్రేమతో ఈ చిత్రాన్ని వేసినట్లు ఆయన తెలిపారు. ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అన్న నినాదం ఈ చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ప్రస్తుత సమాజానికి బాబా బోధనలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
News October 10, 2024
100 రోజుల ప్రణాళికలను సాధించాలి: కలెక్టర్
డిసెంబర్ 31వ తేది లోపు రెండో దశ 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 100 రోజులు లక్ష్యాల (ఫేజ్-II)పై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలకు సంబంధించిన రెండో దశ 100 రోజుల లక్ష్యాల సాధనపై సమీక్షించారు. లక్ష్య సాధనలో వెనకబడకూడదని ఆదేశించారు.