News April 29, 2024

ఈవీఎంల పనితీరుపై అవగాహన ఉండాలి: కలెక్టర్ క్రాంతి

image

ఈవీఎంల పనితీరుపై ఏఆర్వోలు, నోడల్ అధికారులకు అవగాహన ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలోని ఫంక్షన్ హాల్ లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధికారులకు అవగాహన సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.

Similar News

News November 14, 2025

మెదక్: ‘టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలి’

image

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష మినహాయింపు కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించాలని
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును జిల్లా PRTU TS అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సామ్యా నాయక్, గౌరవాధ్యక్షులు సబ్బని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించనున్నట్లు హామీ ఇచ్చారు.

News November 14, 2025

పోలీస్ మైదానం పనులు పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావువాస రావు

image

పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ మైదానం పనులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానం నిర్మాణాన్ని వేగవంతం చేసి, పోలీస్ సిబ్బంది వినియోగానికి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మైదానం సిబ్బంది శారీరక దారుఢ్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

News November 14, 2025

విద్యాసాగర్ రావు కృషి అసామాన్యం: హరీశ్ రావు

image

సాగునీటి రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం ‘నీళ్ల సారు’ విద్యాసాగర్ రావు అసామాన్యమైన కృషి చేశారని ఆయన కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జల దోపిడీని, తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి, చైతన్యపరచడంలో విద్యాసాగర్ రావు సేవలు మరువలేనివని హరీశ్ రావు తెలిపారు.