News June 26, 2024
ఈసారి విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పిన ఆర్థిక బాధలు

విద్యాశాఖ అంచనా ప్రకారం ఖమ్మం జిల్లాకు 5,17,274 పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. వీటిలో 4,50,051 పుస్తకాలను అన్ని రకాల ప్రభుత్వ స్కూళ్లకు అందజేశారు. 2 శాతం బఫర్ స్టాక్ను అందుబాటులో ఉంచారు. 6 నుంచి పదోతరగతి వరకు 31,773 మంది విద్యార్థులకు రాత పుస్తకాలను అధికారులు అందజేశారు. గతంతో పోల్చితే ఈసారి విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News February 11, 2025
భద్రాద్రి: విధుల్లోనూ విడవని తల్లి ప్రేమ

తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఏఎన్ఎంల ట్రైనింగ్కు పలువురు హాజరయ్యారు. ఇందులో భాగంగా పినపాకకు చెందిన ఏఎన్ఎం శ్రీ రేఖ తన ఐదు నెలల కుమారుడితో హాజరైంది. బుడ్డోడిని పడుకోబెట్టేందుకు ఆమె కలెక్టరేట్ ఆవరణలో చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టి, విరామ సమయంలో వచ్చి లాలించారు. ఈ తల్లి ప్రేమను చూసి సహ ఉద్యోగులు అభినందిస్తున్నారు.
News February 11, 2025
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు 4,089 మంది

KMM-NLG-WGL టీచర్ MLC ఎన్నికలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఖమ్మం జిల్లాలో మండలాల వారీగా ఓటర్ల వివరాలు ప్రకటించారు. ఖమ్మం 2474, సత్తుపల్లి 277, మధిర 203, సింగరేణి 177, వైరా 113, కల్లూరు 94, కామేపల్లి 85, ఏన్కూర్ 75, కొణిజర్ల 66, కూసుమంచి 66, వేంసూరు 65, పెనుబల్లి 63, ఎర్రుపాలెం 59, నేలకొండపల్లి 55, రఘునాథపాలెం 41, తల్లాడ 37, చింతకాని 36, ముదిగొండ 35, బోనకల్ 34, తిరుమలాయపాలెం 34 మంది ఉన్నారు.
News February 11, 2025
మధిర: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

మంగళవారం తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల ప్రకారం.. ఏపీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ జైపూర్- చెన్నై ఎక్స్ ప్రెస్ కిందపడటంతో అతడి తల తెగిపోయింది. లోకో పైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.