News March 6, 2025
ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

అంబర్పేట్లో నూతన ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయ భవనాన్ని గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పోలీసుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నగర భద్రత కోసం సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఉపయోగాన్ని పెంచాలని సూచించారు. పోలీసులను చూస్తే నేరస్థలకు భయంపుట్టాలని, ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు.
Similar News
News March 7, 2025
రేవంత్ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ భస్మమే: KTR

కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. సీఎం ఎక్కడ బాధ్యత తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తుందని అన్నారు. రేవంత్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ భస్మమే అని ఆరోపించారు.
News March 7, 2025
మహిళా సదస్సు ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్లో జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వసతులు తదితర అంశాలను చర్చించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్పోల్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, మహిళలకు మజ్జిగప్యాకెట్లు అందించాలన్నారు.
News March 6, 2025
ఇఫ్లూ వీసీగా ప్రొఫెసర్ నాగరాజు

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వైస్ ఛాన్స్లర్గా ప్రొ.నాగలపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని గంగాధర్ మెహర్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అధ్యాపకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.