News July 8, 2024
ఈ ఏడాది లక్ష్యానికి దూరంగా పత్తి సాగు

ఈ ఏడాది పత్తి సాగు లక్ష్యానికి
దూరంగా ఉంది. జిల్లాలో ప్రధాన పంటల్లో వరి తర్వాత స్థానం పత్తిదే. వరి 2.83 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, పత్తి 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఏడాది పత్తి సాగు అంచనాను 2,01,834 ఎకరాలకు తగ్గించారు. అయినా ఆ లక్ష్యం మేరకు కూడా నెరవేరడం ప్రశ్నార్థకంగానే మారింది. శనివారం నాటికి 1,81,794 ఎకరాల్లో మాత్రమే సాగైనట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
Similar News
News December 10, 2025
ఈ-కేవైసీ కారణంతో రద్దయిన రేషన్ కార్డులెన్ని?:ఎంపీ

దేశంలో ఈ-కేవైసీ చేయించుకోని కారణంగా రద్దయిన రేషన్ కార్డుల గణాంకాలను తెలపాలని ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి బుధవారం లోక్సభలో కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర వినియోగదారులు ఆహార ప్రజాపంపిణీ సహాయ మంత్రి నిముబెన్ జయంతి బాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అక్టోబరు నాటికి రాష్ట్రాల వారీగా రద్దయిన కార్డులు, ప్రస్తుత కార్డుల వివరాలను ఆమె సభకు అందించారు.
News December 10, 2025
ఖమ్మంలో తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డు స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 2,41,137 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,089 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి, 4,220 మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
News December 10, 2025
ఖమ్మంలో కాంగ్రెస్కు ఏకగ్రీవాల జోరు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖమ్మం జిల్లాలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 19 పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం నారాయణపురం కూడా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఖాతాలో చేరింది. ఇప్పటివరకు మూడు విడతల్లో కాంగ్రెస్ మొత్తం 56 ఏకగ్రీవాలతో ముందంజలో ఉంది.


