News July 8, 2024
ఈ ఏడాది లక్ష్యానికి దూరంగా పత్తి సాగు

ఈ ఏడాది పత్తి సాగు లక్ష్యానికి
దూరంగా ఉంది. జిల్లాలో ప్రధాన పంటల్లో వరి తర్వాత స్థానం పత్తిదే. వరి 2.83 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, పత్తి 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఏడాది పత్తి సాగు అంచనాను 2,01,834 ఎకరాలకు తగ్గించారు. అయినా ఆ లక్ష్యం మేరకు కూడా నెరవేరడం ప్రశ్నార్థకంగానే మారింది. శనివారం నాటికి 1,81,794 ఎకరాల్లో మాత్రమే సాగైనట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
Similar News
News November 14, 2025
ఖమ్మంలో దడ పుట్టిస్తున్న చలి

ఖమ్మం జిల్లాలో గత నాలుగు రోజులుగా వీస్తున్న చలిగాలుల తీవ్రతతో కనిష్ట ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోయాయి. ఈ చలికి హాస్టల్ విద్యార్థులు, వృద్ధులు వణికిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో వైరల్ న్యుమోనియా వ్యాప్తి చెందుతుండటంతో పిల్లలు, వృద్ధులు ఆసుపత్రులకు వెళ్తున్నారు. శ్వాసకోశ ఇబ్బందులను నిర్లక్ష్యం చేయవద్దని, చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు ప్రజలకు సూచించారు.
News November 14, 2025
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న డయాబెటిస్ బాధితులు

ఖమ్మం జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో 13,35,202 జనాభా ఉన్నారు. వీరిలో మధుమేహం లక్షణాలు ఉన్నవారు 55,829, అధిక రక్తపోటు ఉన్నవారు 77,604 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందిని ఎన్సీడీ పోర్టల్లో నమోదు చేసి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేల్లో జిల్లా మధుమేహ వ్యాప్తిలో 10వ జాబితాలో చేరింది. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’
News November 14, 2025
ఖమ్మం: మా పిల్లలు మంచిగా చదువుతున్నారా..?

ఖమ్మం జిల్లాలోని నేడు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 1,217ప్రభుత్వ పాఠశాలలు,14 కేజీబీవీలు, రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సుమారు 66వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సమావేశాలకు హజరయ్యే పేరెంట్స్కి స్కూల్లో బోధన, విద్యార్థుల పట్ల ఎలా మెలగాలి, వారిని ఎలా ప్రోత్సాహించాలనే అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అంశాల వారీగా 40నిమిషాల పాటు సమావేశం నిర్వహించనున్నారు.


