News December 10, 2024
ఈ నెల శాసనసభ, మండలి సభ్యులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం

జూబ్లిహిల్స్ MCRHRDలో డిసెంబర్ 11,12 తేదీలలో తెలంగాణ శాసనసభ, శాసన మండలి సభ్యులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఉంటుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఓరియంటేషన్ ప్రోగ్రాంకి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం వారు కలిసి పరిశీలించారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ అవగాహన కార్యక్రమానికి తప్పని సరిగా హాజరుకావాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
Similar News
News November 28, 2025
HYDలో పెరుగుతున్న కేసులు.. మీ పిల్లలు జాగ్రత్త !

హైదరాబాద్లో పిల్లలకు చర్మ సంబంధిత(స్కిన్) అలర్జీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చల్లని వాతావరణం, పెరిగిన కాలుష్యం, ధూళి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడలోని బస్తీ దవాఖానలు, పీహెచ్సీల్లో జలుబు, అలర్జీ, జ్వరం లాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చల్లగాలి తగలకుండా చూడాలని, బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లలను ఎత్తుకోవద్దని వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరించారు.
News November 28, 2025
HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.
News November 28, 2025
HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.


