News April 8, 2025

ఈ నెల 10-14 వరకు కామారెడ్డిలో 163 సెక్షన్: SP

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10-14 వరకు 163 (BNSS) సెక్షన్ అమలులో ఉంటుందని SP రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లాలో సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. చట్టవిరుద్ధమైన ఘటనలు జరగకుండా నిరోధించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు  సహకరించాలని కోరారు.

Similar News

News December 14, 2025

SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

image

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.

News December 14, 2025

NRPT: రెండో విడుత తొలి ఫలితం ఇక్కడే..!

image

నారయణపేట జిల్లాలో తొలి ఫలితం విడుదలైంది. దామరగిద్ద మండల పరిధిలోని అయ్యవారిపల్లి సీపీఎం బలపరిచిన అభ్యర్థి వెంకటమ్మ 135 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఆదివారం రోజు విలువడిన ఫలితాల్లో దామరగిద్ద మండలం తొలి ఫలితం విడుదలైంది. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

News December 14, 2025

నదీజలాలపై కేసీఆర్ ప్రత్యక్ష పోరాటం: BRS

image

TG: కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19న BRSLP, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కృష్ణా-గోదావరి నదులపై కేసీఆర్ సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చ జరుగుతుందని BRS వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం జలాలను కొల్లగొడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని విమర్శించింది. దీనిపై ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని కేసీఆర్ భావిస్తున్నట్లు పేర్కొంది.