News April 12, 2025
ఈ నెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వెనుకబడిన తరగతుల నాయకులు, కార్మికులు హాజరుకావాలని ఆమె కోరారు.
Similar News
News October 25, 2025
చిత్తూరు: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు.!

రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు, కుంటల పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
News October 25, 2025
సెస్సు బకాయిలపై దృష్టి సారించాలి: జేసీ

గ్రంథాలయ సెస్సు బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రంథాలయ సెస్సు సమీక్షా సమావేశం శనివారం కలెక్టరేట్లో జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రంథాలయ సంస్థ సెస్సు బకాయిలు రూ. 64, 36,14,822లు ఉన్నాయని చెప్పారు. సెస్ బకాయిలు తక్షణమే వసూలు చేయాలని జేసీ ఆదేశించారు.
News October 25, 2025
కడప జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు కడప JC అదితి సింగ్ శనివారం తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


