News February 18, 2026

ఈ నెల 26న కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి!

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26న కొడంగల్‌కు రానున్నట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ పున:నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఇటీవలే నిధులు మంజూరు చేసింది. ఆలయ నిర్మాణ పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నట్లు తెలిసింది.

Similar News

News March 17, 2026

ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి సవిత సమీక్ష

image

పెనుకొండలోని ఆర్&బీ అతిథి గృహంలో మంత్రి సవిత మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్ పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతీ లబ్ధిదారుకు ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని, 2014-19 కాలంలో ఇల్లు నిర్మించి బిల్లులు పొందని లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News March 17, 2026

HYD: ఫ్లోర్ కడిగినందుకు రూ.5వేల FINE

image

HYDలో తాగునీటి దుర్వినియోగంపై HMWSSB కఠినచర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్‌ వాసి తాగునీటితో ఫ్లోర్లు కడుగుతుండగా గుర్తించి రూ.5వేల జరిమానా విధించారు. ప్రజల నుంచి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

News March 17, 2026

HYD: ఫ్లోర్ కడిగినందుకు రూ.5వేల FINE

image

HYDలో తాగునీటి దుర్వినియోగంపై HMWSSB కఠినచర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్‌ వాసి తాగునీటితో ఫ్లోర్లు కడుగుతుండగా గుర్తించి రూ.5వేల జరిమానా విధించారు. ప్రజల నుంచి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.