News March 24, 2025
ఈ నెల 27న విజయవాడలో ముస్లింసోదరులకు ఇఫ్తార్ విందు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లిం సోదరులకు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు కార్యక్రమంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
Similar News
News October 19, 2025
బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరూ ఇన్స్టా పోస్టు ద్వారా తెలియజేశారు. ‘చివరకు మా బేబీ బాయ్ వచ్చేశాడు. మా హృదయాలు నిండిపోయాయి. ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి. కృతజ్ఞతలతో పరిణీతి, రాఘవ్’ అని రాసుకొచ్చారు. 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
News October 19, 2025
కృష్ణా: కార్తీకమాసానికి ఆలయాలు ముస్తాబు

కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. హిందువులు నియమనిష్టలతో ఆచరించే ఈ మాసంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలకు ఆలయ నిర్వాహకులు సర్వసన్నద్ధమవుతున్నారు. కార్తీకంలో శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల సూచన.
News October 19, 2025
పెనుగంచిప్రోలు: లొంగిపోయిన చిట్టీల వ్యాపారి

పెనుగంచిప్రోలులో గత వారం రోజుల క్రితం సుమారు రూ.5 కోట్లతో పరారైన చిట్టీల వ్యాపారి చిన్న దుర్గారావు ఆదివారం సీఐ కార్యాలయంలో లొంగిపోయారని జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గోల్డ్ స్కీమ్, చిట్టీల పేరుతో మోసాలు చేసి దుర్గారావు పారిపోగా, ఎస్సై అర్జున్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.