News March 24, 2025

ఈ నెల 27న విజ‌య‌వాడ‌లో ముస్లింసోద‌రుల‌కు ఇఫ్తార్ విందు

image

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లిం సోద‌రుల‌కు విజ‌య‌వాడ‌లోని ఏ ప్ల‌స్ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ఇఫ్తార్ విందు కార్య‌క్ర‌మానికి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు హాజ‌ర‌వుతార‌ని ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమంపై స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వహించారు. 

Similar News

News November 17, 2025

కోదాడ: ‘ప్రతి రంగంలోనూ మహిళల అద్భుత ప్రతిభ’

image

మానవ వికాసంలో మహిళల శ్రమ పెద్ద విప్లవం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు డి. స్వరూప అన్నారు. కోదాడలో ఆదివారం నిర్వహించిన సూర్యాపేట జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. గణ సమాజం నుంచి నేటి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి రంగంలోనూ స్త్రీలు అద్భుత ప్రతిభ చూపారని కొనియాడారు. అయితే సమాజం మారుతున్న క్రమంలో స్త్రీని అణగదొక్కారని విమర్శించారు.

News November 17, 2025

‘మైథాలజీ’తో మ్యాజిక్.. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా!

image

పురాణాలు, ఇతిహాసాలను లింక్ చేస్తూ టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. పురాణ పురుషుల కథలతో వచ్చిన కల్కి(మహాభారతం), హనుమాన్(రామాయణం), కార్తికేయ-2(శ్రీకృష్ణుడు), మిరాయ్(అశోకుడు, శ్రీరాముడు) వంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలోని ‘వారణాసి’, చిరంజీవి-వశిష్ట మూవీ ‘విశ్వంభర’ ఈ కోవలోనివే కావడం గమనార్హం.

News November 17, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

image

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్‌కు తెలుస్తుందని తెలిపారు. సూరత్‌లోని రైల్వే కారిడార్‌లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.