News October 10, 2024

ఈ-పంట నమోదు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలోని ఈ-పంట నమోదు ప్రక్రియ సూపర్ చెక్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మతో కలిసి వ్యవసాయ అనుబంధ రంగ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News October 10, 2024

SKU పరిధిలో డిగ్రీ 2వ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

image

SKU పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్‌ ఫలితాలను యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ బి.అనిత విడుదల చేశారు. మొత్తం 8,551 మంది పరీక్ష రాయగా 3,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో BAలో 461 మందికి గానూ 108 మంది, BBAలో 818 మందికి గానూ 353 మంది, BCAలో 174 మందికి గానూ 62 మంది, BCMలో 4,512 మందికి గానూ 1,635 మంది, BSCలో 2,586 మందికి గానూ 1,234 మంది ఉత్తీర్ణత చెందారు.

News October 9, 2024

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి: బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి

image

మాజీ సీఎం జగన్ X వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ‘2011లో ప్రారంభమైన YCP నుంచి ఇప్పటివరకు 35 మంది MPలు, 232 మంది MLAలు గెలిచారు. ఇప్పుడు మీరు నిందిస్తున్న EVMల వల్లే గెలిచి మీరు CM అయ్యారు. మీ పాలనలో చేసిన తప్పులను దాచడానికి ప్రయత్నించడం మానేయండి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, వాస్తవాలను గ్రహించి, ఆరోపణలు మానుకోండి’ అని పేర్కొన్నారు.

News October 9, 2024

డీసీఆర్సీ విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్సీ విభాగం సిబ్బందితో జిల్లా ఎస్పీ రత్న సమీక్ష నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో డిసిఆర్బి శాఖ ఎంతో కీలకమైనదని అన్ని కేసులపై అవగాహన పెంచుకొని పనిచేయాలని ఎస్పీ సూచించారు. క్రైమ్ కేసులతోపాటు ఎస్సీ ఎస్టీ, లోకాయుక్త, రౌడీషీటర్స్, చోరీలు, బోర్డర్ పోలీస్ స్టేషన్, క్రిమినల్స్, ఫ్యాక్షన్ గ్రామాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.