News February 18, 2025
ఈ ప్రాంతాల్లో భారీగా పడిపోయిన భూగర్భ జలాలు

గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని తెలిపిన భూగర్భజల శాఖ అధికారులు లిస్ట్ విడుదల చేశారు. ఎర్రగడ్డ, చంద్రాయణగుట్ట, మేడిపల్లి, హస్మత్పేట, యాప్రాల్, ఫతేనగర్, దూలపల్లి, శంభిపూర్, చెంగిచెర్ల, గుండ్ల పోచంపల్లి, మేడిపల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఉప్పల్, పటాన్చెరు, రామంతపూర్, రామచంద్రపురం ప్రాంతంలోనూ 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.
Similar News
News March 28, 2025
కలెక్షన్లలో ‘L2: ఎంపురాన్’ రికార్డు

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్లాల్ హీరోగా నటించిన ‘L2: ఎంపురాన్’ దేశవ్యాప్తంగా తొలి రోజు ₹21కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇంతకముందు ఈ రికార్డు పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ (₹8.95cr) పేరిట ఉండేది. ‘లూసిఫర్’కు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. మీరు ఈ మూవీ చూశారా? ఎలా ఉంది?
News March 28, 2025
సంగారెడ్డి: భార్య సూసైడ్కు కారణమైన భర్తకు జైలు శిక్ష

ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల నిర్మాణ విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. ఇస్మాయిల్కన్పేటకు చెందిన లక్ష్మయ్య మద్యానికి బానిసై భార్య యాదమ్మను వేధించేవాడు. మద్యం తాగి వచ్చి భార్యను వేధిడంతో 2019లో ఆత్మహత్య చేసుకుంది. ఈకేసులో నేరం నిరూపణ కావడంతో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.
News March 28, 2025
చార్ధామ్ యాత్ర.. వీడియోలు, రీల్స్ చిత్రీకరణపై నిషేధం

ఈ ఏడాది చార్ధామ్ యాత్ర సందర్భంగా ఆలయాల ప్రాంగణంలో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిషేధం ఉండనుంది. ఆలయ ప్రాంగణంలో వీడియోలు, రీల్స్ చేస్తూ ఎవరైనా దొరికితే వారికి దర్శనం నిరాకరించి తిరిగి పంపించేస్తామని కేదార్నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ప్రకటించింది. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి తలుపులు, మే 2న కేదార్నాథ్, 4న బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.