News February 18, 2025
ఈ ప్రాంతాల్లో భారీగా పడిపోయిన భూగర్భ జలాలు

గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని తెలిపిన భూగర్భజల శాఖ అధికారులు లిస్ట్ విడుదల చేశారు. ఎర్రగడ్డ, చంద్రాయణగుట్ట, మేడిపల్లి, హస్మత్పేట, యాప్రాల్, ఫతేనగర్, దూలపల్లి, శంభిపూర్, చెంగిచెర్ల, గుండ్ల పోచంపల్లి, మేడిపల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఉప్పల్, పటాన్చెరు, రామంతపూర్, రామచంద్రపురం ప్రాంతంలోనూ 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.
Similar News
News March 8, 2026
నల్గొండ: గ్యాస్ సెగ.. సామాన్యుడిపై రూ.70 కోట్ల అదనపు భారం

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి వంటింట్లో మంటలు రేపింది. డొమెస్టిక్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 చొప్పున పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజా పెంపుతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై ఏడాదికి సుమారు రూ.70 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ధరల పెరుగుదలపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News March 8, 2026
నల్గొండ: దేశంలోనే అరుదైన దేవాలయం మన దగ్గరే..

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో కృష్ణానది ఒడ్డున విశిష్టమైన సూర్య దేవాలయం కొలువై ఉంది. దేశంలోనే పడమర దిక్కున ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. ఇక్కడ సూర్యాస్తమయ సమయంలో కిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకడం విశేషం. విశ్వామిత్ర మహర్షి సర్పయాగం చేసిన ఈ ప్రాంతంలో, కాకాసురుని వధ జరిగినందున కాకులు కనిపించవని భక్తుల నమ్మకం. ఈ గుడిని 800 ఏళ్ల క్రితం కల్యాణ చాళుక్యులు నిర్మించారు.
News March 8, 2026
మహబూబాబాద్: మహిళలపై పెరుగుతున్న దాడులు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంగా మహిళలపై అనేక దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 176 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. 42 ఈవ్ టీజింగ్ కేసులు, 55 అత్యాచారం కేసులు, 5 వరకట్న హత్యల కేసులు, 9 మహిళల హత్యల కేసులు, 178 అత్యాచారయత్నం కేసులు నమోదయ్యాయి. మహిళలపై వేదింపుల కేసులను షీ టీం పోలీస్ స్టేషన్లు పరిష్కారించనుంది.


