News February 6, 2025

ఉంగుటూరు: ఎలుకల మందు తాగిన వ్యక్తి.?

image

ఎలుకల మందు తాగి వ్యక్తి చనిపోయిన ఘటన ఉంగుటూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మానికొండకు చెందిన షేక్ మునీర్ మద్యానికి బానిసై ఎలుకల మందు వాటర్‌లో మిక్స్ చేసి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బెజవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

Similar News

News April 16, 2026

కృష్ణాజిల్లాలోని ప్రభుత్వ కాలేజ్ లో ఇంటర్ ఫలితాలు ఇలా..?

image

* ఆకునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1st Year 50%, 2nd Year 56%
* అవనిగడ్డ కళాశాలలో 1st Year 57%, 2nd Year 67%
* బంటుమిల్లి కళాశాలలో 1st Year 63%, 2nd Year 74%
* మచిలీపట్నం లేడియాంప్తిల్ లో 1st Year 82%, 2nd Year 94%
* మొవ్వ కళాశాలలో 1st Year 76%, 2nd Year 89%
* పామర్రు కళాశాలలో 1st Year 66%, 2nd Year 92%
* పెడన కళాశాలలో 1st Year 49%, 2nd Year 67%
* రుద్రపాక కళాశాలలో 1st Year 38%, 2nd Year 48%

News April 16, 2026

భర్త మరణం తట్టుకోలేక.. భార్య కన్నుమూత

image

కృష్ణాజిల్లా గూడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కప్పలదొడ్డికి చెందిన తిరుమలశెట్టి వీర రాఘవరావు (66) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య పద్మావతి (61) కొద్దిసేపటికే స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె కూడా ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 15, 2026

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు

image

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు మరోసారి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. గతంలో పొలిట్ బ్యూరో మెంబర్లుగా పని చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులైన వర్ల రామయ్యను మరోసారి పొలిట్ బ్యూరో మెంబర్లుగా నియమించారు. జగ్గయపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను కూడా పొలిట్ బ్యూరో మెంబర్‌గా నియమించారు. తాతయ్య గతంలో టీడీపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు.