News March 21, 2024

ఉంగుటూరు: ఒకే వేదికపై ఎమ్మెల్యే అభ్యర్థులు

image

ఉంగుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ప్రస్తుత అభ్యర్థి పుప్పాల వాసుబాబు, జనసేన- టీడీపీ- బీజేపీ కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఒకే వేదికపై కనిపించారు. నిడమర్రు మండలం
పెదనిండ్రకొలను రథోత్సవంలో వీరిద్దరూ వాహనంపై ఎక్కి పూజలు నిర్వహించారు. వారితో పాటే మాజీ MLA గన్ని వీరాంజనేయులు కూడా ఉన్నారు. ముగ్గురు నాయకులు పరస్పరం అభివందనం చేసుకుని భక్తి కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యత చోటుచేసుకుంది.

Similar News

News December 13, 2025

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి: కలెక్టర్

image

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం ఎస్ఆర్ కె‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా నేటి నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.

News December 13, 2025

నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

image

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.

News December 13, 2025

జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలపై సమీక్ష చేపట్టిన జేసీ

image

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ..డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించే వారోత్సవాలు నిర్వహించాలని అన్నారు.