News February 11, 2025
ఉంగుటూరు : రైలు పట్టాలపై దంపతుల ఆత్మహత్య

ఉంగుటూరు రైల్వే స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు బాధ వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో దొరికిన ఫోన్ ఆధారంగా వారు పెంటపాడు మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదంలో మృతదేహాలు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 1, 2025
ALERT: నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు- SP

మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో శాంతి భద్రతలు సమర్థంగా కొనసాగేందుకు డిసెంబర్ 01 నుంచి డిసెంబర్ 31 వరకు పోలీస్ యాక్ట్–1861లోని సెక్షన్ 30, 30(ఎ) నిబంధనలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేనిదే ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్(సభలు) నిర్వహించరాదన్నారు.
News December 1, 2025
గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.
News December 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో నిలిచిన మీసేవ సేవలు

జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో రెండు రోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు, విద్యా సంబంధిత అవసరాల కోసం వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే సర్వర్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


