News February 18, 2025
ఉంగుటూరు: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

ఉంగుటూరు(M) బావాయిపాలెంలో <<15486017>>ఏసురాజు హత్యకు <<>>వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ప్రియురాలు భర్త, మామలే ఏసు రాజుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తన భార్యతో చనువుగా ఉండొద్దని ఆమె భర్త చెప్పినా వినకపోవడం, మెసేజ్లు చేస్తున్నాడనే కోపంతో ఏసురాజుని బావాయిపాలెం తీసుకొచ్చి చేయి నరికేశారు. అనంతరం రక్తస్రావంతో ఏసు మృతి చెందాడు. కాగా మృతుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
Similar News
News October 15, 2025
భారీగా తగ్గిన IPL విలువ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విలువ వరుసగా రెండో ఏడాది పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి రూ.82,700కు తగ్గింది. 2025లో మరో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్స్గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం, TVని డిజిటల్ మీడియా ఓవర్టేక్ చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలు.
News October 15, 2025
సిద్దిపేట: బాలికల పాఠశాలల్లో సీట్ల భర్తీకి రేపే లాస్ట్

సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లోని బాలికల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు డీసీఓ పోలోజు నరసింహచారి బుధవారం తెలిపారు. సిద్దిపేట రూరల్, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, ములుగు సహా 13 మండలాల్లోని బాలికల పాఠశాలల్లో ఈ అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు సీట్ల కోసం ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
News October 15, 2025
గూగుల్తో విశాఖ రూపురేఖలే మారిపోతాయ్: లోకేశ్

గూగుల్ డేటా సెంటర్ విశాఖ రూపురేఖలనే మార్చేస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇది కేవలం డేటా సెంటర్ కాదని.. దీంతో ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖ వస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. నవంబర్లోనే టీసీఎస్ వస్తుందని, డిసెంబర్లో కాగ్నిజెంట్ పనులు ప్రారంభిస్తుందన్నారు.