News February 18, 2025
ఉంగుటూరు: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

ఉంగుటూరు(M) బావాయిపాలెంలో <<15486017>>ఏసురాజు హత్యకు <<>>వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ప్రియురాలు భర్త, మామలే ఏసు రాజుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తన భార్యతో చనువుగా ఉండొద్దని ఆమె భర్త చెప్పినా వినకపోవడం, మెసేజ్లు చేస్తున్నాడనే కోపంతో ఏసురాజుని బావాయిపాలెం తీసుకొచ్చి చేయి నరికేశారు. అనంతరం రక్తస్రావంతో ఏసు మృతి చెందాడు. కాగా మృతుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
Similar News
News March 19, 2025
మెదక్: ఇండియా టుడే లో ఎంఈవోకు చోటు

తూప్రాన్ ఎంఈఓగా పనిచేస్తున్న పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణకు ఇండియా టుడే టాప్-10 పాయనీరింగ్ మైండ్స్ ఆఫ్ 2025లో చోటు దక్కింది. భారతదేశపు అత్యంత టాప్-10 ప్రభావశీలుర మార్గదర్శక వ్యక్తుల్లో సత్యనారాయణ చోటు దక్కడం పట్ల మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
News March 19, 2025
లక్షెట్టిపేట: ‘వసంత అరెస్ట్.. రిమాండ్కు తరలింపు’

లక్షెట్టిపేట పట్టణంలో కొత్తశ్యామల మెడలో బంగారు గొలుసును దొంగిలించిన నిందితురాలు సముద్రాల వసంతను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండుకు పంపామని సీఐ అల్లం నరేందర్, ఎస్సై సతీష్ తెలిపారు.16న శ్యామల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వసంత ప్లాన్ ప్రకారం శ్యామల మెడలోని సుమారు 3 తులాల పుస్తెలతాడును దొంగలించి పారిపోయిందన్నారు. శ్యామల ఫిర్యాదు మేరకు వసంతను అరెస్టు చేసి రిమాండ్కు పంపామని వారు తెలిపారు.
News March 19, 2025
అచ్చంపేట: అర్హత లేని ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు

అచ్చంపేట పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులపై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రిలో ఎలాంటి అర్హత లేని ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తుండగా వారిపై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట పోలీసులు తెలిపారు. సాయి క్లినిక్లో నరేందర్, కావేరి పాళీ క్లినిక్లో లింగాచారి ఎంబీబీఎస్ అర్హత లేకుండా రోగులకు వైద్యం చేస్తున్నారని చెప్పారు.