News February 24, 2025
ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 27, 2025
జూబ్లీహిల్స్లో త్వరలో ఏపీ నేతల ప్రచారం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏపీకి చెందిన వారి ఓట్లు అధిక శాతం ఉన్నాయి. ఆ ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ ఏపీ నేతలను ప్రచారానికి వినియోగించనుంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పలువురు ఏపీ నాయకులున్నాయి. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ప్రచారం చేయనున్నారు.
News October 27, 2025
అనంతపురం యువకుడికి రూ.2.25 కోట్ల జీతంతో గూగుల్లో ఉద్యోగం

AP: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సాత్విక్ రెడ్డి గూగుల్లో ఉద్యోగం సంపాదించారు. న్యూయార్క్లోని Stony Brook Universityలో ఇంజినీరింగ్ పూర్తి చేసి కాలిఫోర్నియాలోని గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించారని అతడి తండ్రి కొనదుల రమేశ్ రెడ్డి తెలిపారు. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం అందుకోనున్నట్లు వెల్లడించారు. కాగా అనంతపురం మూలాలు ఉన్న సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ CEOగా ఉన్న సంగతి తెలిసిందే.
News October 27, 2025
జూబ్లీహిల్స్లో త్వరలో రేవంత్ రెడ్డి ప్రచారం

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపు కోసం నాయకులు ప్రతి ఇంటినీ టచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని నిర్ణయించారు. 2రోజుల పాటు స్థానికంగా పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏఏ తేదీల్లో ప్రచారం చేయాలనేది గాంధీ భవన్ ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది.


