News March 13, 2025
ఉండవెల్లి: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య.!

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన మధు(21) అనే యువకుడు జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలోని కర్నూలు వైపు వెళ్లే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఓ పెళ్ళికి వెళ్లి తన అన్న వాసుకు కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆత్మహత్య గల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 21, 2025
అవి తీసుకురాకండి: వనపర్తి జిల్లా కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8:30 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలని, స్మార్ట్ వాచ్లు, మొబైల్ ఫోన్లు వంటివి తీసుకురావద్దని సూచించారు.
News March 21, 2025
నాగర్ కర్నూల్: ‘జైలులో ఖైదీలు ఎలా ఉన్నారు..?’

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సబ్ జైలును గురువారం జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ, జిల్లా జడ్జి సబిత సందర్శించారు. జైల్లో ఖైదీలు ఎలా ఉన్నారు.. వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఖైదీలకు వండే ఆహార పదార్థాలను, వంటగదిని పరిశీలించారు. పిల్లలకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు.
News March 21, 2025
తిరుపతిలో 248 మందికి సబ్సిడీ రుణాలు

తిరుపతి పార్లమెంట్ పరిధిలో పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలుపై కేంద్ర మంత్రిని ఎంపీ గురుమూర్తి పార్లమెంట్లో ప్రశ్నించారు. కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావ్నీత్ సింగ్ సమాధానం ఇస్తూ… తిరుపతి పార్లమెంట్ పరిధిలో 248 మంది లబ్ధిదారులకు రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.