News April 7, 2024
ఉండి టికెట్ RRRకేనా..? మీ కామెంట్..?

టీడీపీ అధినేత చంద్రబాబు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో పాలకొల్లులో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉండి MLA అభ్యర్థిగా సిట్టింగ్ MLA మంతెనను కాదని RRRకు కేటాయించినట్లు వార్తలు రావడంతో మంతెన అభిమానులు బాబు కాన్వాయ్ వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఆ తర్వాత టికెట్పై పూర్తి క్లారిటీ ఇవ్వలేదని మంతెన, RRR వేర్వేరుగా మీడియాతో వెల్లడించారు. దీంతో సందిగ్ధత నెలకొంది.
– మీ కామెంట్..?
Similar News
News December 24, 2025
ప.గో: అకౌంట్లో నుంచి రూ.90 వేలు కట్.. ఎలాగో తెలిస్తే షాక్!

వాట్సాప్కు వచ్చిన లింక్ను క్లిక్ చేసిన ఓ వ్యక్తి రూ.90 వేలు పోగొట్టుకున్నారు. ఉమ్మడి ప.గో జిల్లా ఏలూరులోని దక్షిణపు వీధికి చెందిన సత్యనారాయణకు ఈనెల 17న ‘ఎం-పరివాహన్’ పేరుతో మెసేజ్ రాగా, దాన్ని ఓపెన్ చేయగానే ఖాతా నుంచి నగదు మాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏలూరు వన్టౌన్ ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News December 24, 2025
ఈనెల 28న జిల్లాకు కేంద్రమంత్రి సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంకలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన ఇక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News December 24, 2025
ఈనెల 28న జిల్లాకు కేంద్రమంత్రి సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 28న మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంకలో పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన ఇక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్షించారు. పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


