News December 24, 2024
ఉండి: పనికని తీసుకెళ్లి చంపేశాడు..!
ఉండి డెడ్బాడీ పార్శిల్ కేసులో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తులసి ఇంటికి వచ్చిన డెడ్బాడీ <<14958481>>పర్లయ్యదిగా<<>> గుర్తించిన విషయం తెలిసిందే. తన ఇంట్లో తాపీ పనుల కోసం పర్లయ్యను తులసి చెల్లెలి భర్త శ్రీధర్ వర్మ తీసుకెళ్లి హత్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఓ మహిళ సాయంతో ఈ డెడ్బాడీని తులసికి పంపాడు. ఆస్తి కోసమే ఈ నేరాన్ని తన వదిన, అత్తమామలపై నెట్టే ప్రయత్నంలో ఇలా చేసి ఉంటాడని అందరూ అనుమానిస్తున్నారు.
Similar News
News January 16, 2025
మొగల్తూరులో కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు
మొగల్తూరులో బుధవారం సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి 200 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. మొగల్తూరుకి చెందిన విష్ణు ప్రియ, గుంటూరుకు చెందిన త్రిపురమల్లు వైష్ణవ్లకు గత ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. తొలి పండుగకు అల్లుడితో పాటు కుటుంబ సభ్యులను విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఫణి, ఝాన్సీలు ఆహ్వానించారు. వైష్ణవ్కు 200 రకాల పిండివంటలతో విందు ఏర్పాటు చేసి మర్యాద చేశారు.
News January 16, 2025
ప.గో: మూడు రోజులు…రూ.1000 కోట్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందాలు కూడా ముగిశాయి. ఈసారి కోడిపందాలు భారీ స్థాయిలో జరిగాయి. మొత్తం 3 రోజులుగా కోడిపందాలు, గుండాట, పేకాట మొత్తం కలిపి సుమారు రూ.1000 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.
News January 15, 2025
ప.గో : పందేలలో పచ్చకాకిదే హవా
ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం కుక్కుట శాస్త్రం ఉందని పందెం రాయుళ్లు చెబుతున్నారు. మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు. దీంతో కుక్కుట శాస్త్రంలో అవగాహన ఉన్నవాళ్లు మంగళవారం అంతా పచ్చకాకి కోడి పుంజుల హవానే కొనసాగిందని అంటున్నారు.