News December 21, 2024
ఉండి: పార్శిల్లో డెడ్బాడీ.. సరికొత్త విషయాలు
ఉండి మండలం యండగండిలో తులసి ఇంటికి వచ్చిన పార్శిల్లో గుర్తు తెలియని డెడ్బాడీ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ డెడ్బాడీ పార్శిల్ వచ్చినప్పటి నుంచి తులసి చెల్లెలి భర్త కనిపించడం లేదు. అతను ఎక్కడికి వెళ్లాడో ఇంత వరకు ఎవరికీ తెలియలేదు. అసలు ఆ మృతదేహం ఎవరిదో కూడా ఇంకా తెలియకపోవడం సంచలనంగా మారింది.
Similar News
News January 18, 2025
జర్మనీ అబ్బాయి, ఏలూరు జిల్లా అమ్మాయి నిశ్చితార్థ వేడుక
దేశాలు దాటిన ప్రేమ పెళ్లిగా మారిన అపూర్వ ఘటన టీ.నర్సాపురం మండలం ఏపుగుంటలో గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఏపుగుంటకు చెందిన లావణ్య జర్మనీలో ఉద్యోగ రీత్యా పనిచేస్తున్న సమయంలో మార్కస్, లావణ్యల మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. దీంతో ఇవాళ గ్రామంలో వీరి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వివాహం జర్మనీలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
News January 18, 2025
ఏలూరు: చనిపోయిన కోడికి వేలం..రూ. లక్ష
సంక్రాంతి కోడిపందేల బరిలో మృతి చెందిన ఓ కోడికి యజమానులు వేలంపాట నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జాలిపూడికి చెందిన నవీన్ చంద్రబోస్ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.1,11,111 వెచ్చించి కోడిని దక్కించుకున్నారు. ఈ వేలం పాటకు అధిక సంఖ్యలో జనం పోటీ పడగా చంద్రబోస్ గెలుపొందారు.
News January 18, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లి రాజుది మన ఏలూరే
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని బుల్లి రాజు క్యారెక్టర్తో అందరినీ అలరించిన రేవంత్ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లి గ్రామానికి చెందిన రొయ్యల వ్యాపారి భీమాల శ్రీనివాస రావు కుమారుడు. రేవంత్ ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేశ్కి కొడుకుగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. 11 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీకి కొత్తైనా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.