News December 23, 2024
ఉండి: శ్రీధర్ దొరికితేనే అన్నీ తేలుతాయి..!

ఉండిలో పార్శిల్లో డెడ్బాడీ కేసు ఓ కొలిక్కి రావడం లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న తులసి చెల్లెల భర్త శ్రీధర్ వర్మ మూడు పేర్లతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తులసితో ఆస్తి తగాదాలు ఉన్న క్రమంలో అతనే ఓ మహిళ సాయంతో తులసి ఇంటికి డెడ్బాడీ పంపాడని సమాచారం. ఆ డెడ్బాడీ ఎవరిది? పార్శిల్ తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్కు చెప్పిన మహిళ ఎవరు? అనే ప్రశ్నలకు శ్రీధర్ చిక్కితేనే సమధానం తెలుస్తుంది.
Similar News
News December 6, 2025
కలెక్టర్ పిలుపు.. ‘3కె రన్ విజయవంతం చేయండి’

భీమవరం పట్టణంలో ట్రాఫిక్పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 3కె రన్ శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రన్ బీవీ రాజు సర్కిల్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఆర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
News December 5, 2025
కలెక్టర్ పిలుపు.. ‘3కె రన్ విజయవంతం చేయండి’

భీమవరం పట్టణంలో ట్రాఫిక్పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 3కె రన్ శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రన్ బీవీ రాజు సర్కిల్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఆర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
News December 5, 2025
ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.


