News May 11, 2024
ఉండేది విజయనగరం జిల్లా.. ఓటు విశాఖ ఎంపీకి

విశాఖ జిల్లాలో మొత్తం 1,991 పోలింగ్ కేంద్రాలున్నాయి. విశాఖ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,962గా ఉంది. అయితే ఈ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఉంది. ఆ నియోజకవర్గ ఓటర్లు విశాఖ ఎంపీకి తమ ఓటు వేస్తారు. పెందుర్తి నియోజకవర్గంలోని కొంత భాగం విశాఖ జిల్లాలో ఉండగా.. ఆ నియోజకవర్గ ఓటర్లు అనకాపల్లి ఎంపీ స్థానానికి తమ ఓటును వినియోగించాల్సి ఉంటుంది.
Similar News
News November 10, 2025
శబరిమలకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

విశాఖపట్నం నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీలతో బస్సులు నడుపుతోందని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. పంచరామాల యాత్రలా శబరిమలైకి కూడా విశేష స్పందన లభించిందన్నారు. నవంబర్ 19-23 వరకు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా డిమాండ్ మేరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. బస్సుల వివరాల కోసం ద్వారక బస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
News November 9, 2025
షీలా నగర్ జంక్షన్లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

షీలా నగర్ జంక్షన్లో ఆదివారం రాత్రి బైక్పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి తల పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వడంతో గుర్తించడానికి వీలు లేని విధంగా అయిపోయింది. పోలీసులు వివరాల సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియల్సి ఉంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నారు.
News November 9, 2025
‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కురసాల కన్నబాబు

విశాఖ వైసీపీ కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో ఆదివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతులు మీదుగా “ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా నవంబర్-12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


