News March 23, 2025
ఉక్కు పరిశ్రమ ఊసే లేని కేంద్ర, రాష్ట్ర బడ్జెట్: సీపీఎం

ఉక్కు పరిశ్రమ ఊసే లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లను ప్రజానీకం వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంట ఉపేందర్ పిలుపునిచ్చారు. శనివారం వెంకన్న అధ్యక్షతన సీపీఎం మండల సాధారణ సమావేశం వేజేళ్ళ సైదులురావు భవనంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
సైన్యాన్ని కూడా ఆ 10% మందే నియంత్రిస్తున్నారు: రాహుల్

బిహార్ ఎన్నికల ప్రచారంలో CONG నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. ‘దేశంలోని 10% జనాభాకే (అగ్రవర్ణాలు) కార్పొరేట్ సెక్టార్, బ్యూరోక్రసీ, జుడీషియరీలో అవకాశాలు దక్కుతున్నాయి. చివరకు ఆర్మీ కూడా వారి కంట్రోల్లోనే ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 90% ఉన్న SC, ST, BC, మైనారిటీలు కనిపించరని పేర్కొన్నారు. కాగా భారత సైనికుల్ని చైనా సైన్యం కొడుతోందని ఇదివరకు RG కామెంట్ చేయగా SC మందలించింది.
News November 4, 2025
స్పోర్ట్స్ రౌండప్

✒ మోకాలి గాయంతో బిగ్బాష్ లీగ్ సీజన్-15కు అశ్విన్ దూరం
✒ రంజీ ట్రోఫీ: రాజస్థాన్పై 156 రన్స్ చేసిన ముంబై బ్యాటర్ యశస్వీ జైస్వాల్
✒ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్: IND-A కెప్టెన్గా జితేశ్ శర్మ, జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
✒ ICC ఉమెన్స్ ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నం.1గా లారా వోల్వార్డ్ట్.. రెండో స్థానానికి చేరిన స్మృతి మంధాన
✒ U19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ఎంపికైన ద్రవిడ్ కుమారుడు అన్వయ్ 
News November 4, 2025
ఘణపురం: కోటగుళ్లలో ఫ్రాన్స్ దేశస్థుల సందడి

కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం ఫ్రాన్స్ దేశస్థులు సందడి చేశారు. ఫ్రాన్స్కి చెందిన ఎరిఫ్, ఎలిక్లు ఆలయాన్ని సందర్శించారు. మొదట స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ పరిసరాలు, అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించారు. కోటగుళ్ల చరిత్రను ఆలయార్చకులు జూలపల్లి నాగరాజును వారు అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణం అద్భుతమని కొనియాడారు.


