News March 28, 2025
ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

జిల్లాలో విశ్వావస నామ తెలుగు సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో ఉగాది ఉత్సవ వేడుకలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్వో రాము నాయక్, తదితరులు ఉన్నారు.
Similar News
News October 28, 2025
MBNR: గంజాయి విక్రయంపై దాడి.. నిందితులు వీరే

MBNR(D) మాచారం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధిలో గంజాయి విక్రయంపై పోలీసులు దాడి నిర్వహించారు. నిందితులు 1.మరికంటి సుమంత్ రెడ్డి(MBNR),2.అబ్దుల్ రెహమాన్(MBNR),3.శుభోద్ కాంత్ శర్మ(బీహార్),4.సత్తు యాదవ్ కుమార్(బిహార్) గంజాయి కొనుగోలు,విక్రయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు నిర్ధారణ కావడం వల్ల దాడి చేసి అరెస్టు చేశారు. దీంతో RNCC యూనిట్, ఈగల్ టీం,SI ఖాదర్, పోలీస్ సిబ్బందిని SP ప్రశంసించారు.
News October 28, 2025
అనకాపల్లి జిల్లాలో 63.1 మి.మీ. సరాసరి వర్షపాతం

అనకాపల్లి జిల్లాలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి మంగళవారం ఉ.6 గంటల వరకు సరాసరి వర్షపాతం 63.1 మి.మీ. నమోదయింది. రాంబిల్లి మండలంలో 119.4.మి.మీ., కె.కోటపాడులో 73.6 మి.మీ., సబ్బవరంలో 98.2 మి.మీ. పరవాడలో107.2మి.మీ. బుచ్చెయ్యపేటలో 58.6 మి.మీ. వర్షం పడింది. రావికమతంలో 62.4.మి.మీ. నక్కపల్లిలో 87 మి.మీ. చోడవరంలో 64.4 మి.మీ. అచ్చుతాపురంలో 82.8 మి.మీ.,మునగపాకలో 87.8, వర్షపాతం నమోదయింది.
News October 28, 2025
మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా ‘మొంథా’!

AP: ‘మొంథా’ తుఫాను దూసుకొస్తోంది. గడిచిన 6గంటల్లో 17kmph వేగంతో కదులుతున్నట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 230KM, కాకినాడకు 310KM, విశాఖపట్నంకి 370KM దూరంలో కేంద్రీకృతమైందని చెప్పింది. మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడనుందని వివరించింది. రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది.


