News January 23, 2025
ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ: మంత్రి జూపల్లి

రానున్న ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, MLA మేఘారెడ్డి తెలిపారు. సల్కెలాపురం గ్రామంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని, నిరుపేదలకు అండగా నిలిచి ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Similar News
News December 1, 2025
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఆర్వోలకు శిక్షణ

రెండో విడత పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సిరిసిల్లలోని కలెక్టరేట్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రతి ఆర్ఓ వ్యవహరించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. నామినేషన్ల దాఖలు నుంచి లెక్కింపు వరకు అప్రమతంగా ఉండాలన్నారు.
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.
News December 1, 2025
నిర్మల్: డీఎడ్ పరీక్షకు 83 మంది హాజరు

నిర్మల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కస్బాలో జరుగుచున్న డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలకు 93 మంది విద్యార్థులకు గాను 83 మంది విద్యార్థులు హాజరుకాగా పదిమంది గైరాజరయ్యారని డీఈవో భోజన్న తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కే సత్యనారాయణ రెడ్డి, నిర్మల్ ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ సందర్శించారు.


