News March 29, 2025
ఉగాది పురస్కారానికి ఎంపికైన”పుట్టం రాజు”

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే ఉగాది పురస్కారం 2025కు అద్దంకికి చెందిన సాహితీవేత్త పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి ఎంపికైనట్లు రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృత సమితి శనివారం వెల్లడించింది. పుట్టం రాజు సాహిత్య రంగంలో విశేష సేవలు అందించి పలు పురస్కారాలు అందుకున్నారు. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని పుట్టంరాజు అందుకోనున్నారు
Similar News
News April 19, 2025
ఆసిఫాబాద్ MPDO ఆఫీస్ను సందర్శించిన కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్ MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు చేపడుతున్న దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు.
News April 19, 2025
ప్రభుత్వ భూమిని ‘వసంత హోమ్స్’ ఆక్రమించింది: హైడ్రా

హైదరాబాద్ హఫీజ్పేట్ సర్వే నంబర్ 79లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా వివరణ ఇచ్చింది. ‘39.2 ఎకరాల్లో సగానికిపైగా ఆక్రమణలు జరిగాయి. అది ప్రభుత్వ నిషేధిత భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. సర్వే నం.79/1 పేరుతో ప్రభుత్వాన్ని ‘వసంత హోమ్స్’ తప్పుదోవ పట్టించింది. 19 ఎకరాలు ఆక్రమించి ఇళ్లు కట్టి అమ్మేశారు. ఖాళీగా ఉన్న మరో 20 ఎకరాల్లోనూ నిర్మాణాలు చేపట్టారు’ అని వివరించింది.
News April 19, 2025
KKR అసిస్టెంట్ కోచ్గా అభిషేక్ నాయర్

భారత జట్టు మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ తిరిగి కేకేఆర్ జట్టుతో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘వెల్కమ్ బ్యాక్ హోమ్’ అంటూ KKR ట్వీట్ చేసింది. గతంలో అభిషేక్ KKR కోచింగ్ సిబ్బందిలో పనిచేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో నాయర్పై BCCI వేటు వేసినట్లుగా తెలుస్తోంది.