News March 21, 2024

ఉగాది పురస్కారానికి పల్నాడు ఏఆర్ అడిషనల్ SP ఎంపిక

image

ఉగాది పురస్కారాలకు పల్నాడు జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ రామచంద్ర రాజు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేస్తుంది. ఈ క్రమంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి సిఫారసు మేరకు ఉత్తమ సేవలు అందించిన రామచంద్ర రాజుకు ప్రభుత్వం 2024 ఉత్తమ సేవా పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా బుధవారం అధికారులు, సిబ్బంది ఆయన్ను అభినందించారు.

Similar News

News April 18, 2025

తెనాలి: తప్పించుకొని తిరుగుతున్న నిందితుడి అరెస్ట్

image

తెనాలిలో 2022లో జరిగిన హత్య కేసులో నిందితుడు జాన్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన జాన్‌బాబు హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు కనబడకుండా తిరుగుతున్న జాన్‌బాబును రూరల్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.

News April 17, 2025

మంగళగిరి: ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు  

image

AIIMSలో ఇక పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె జబ్బులకు బైపాస్ సర్జరీలు, ICU విభాగం ప్రారంభమయ్యాయి. ఇటీవల మొదటి సర్జరీ విజయవంతంగా జరిగింది. 46 విభాగాల్లో సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిలో రోజూ 3,500మందికి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 22లక్షలపైగా రోగులకు సేవలు, 37లక్షల ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. మార్చి చివరి వరకు 4.39లక్షల ఓపీ రోగులు, 42,843 ఇన్‌పేషెంట్లకు సేవలు అందించారు. 

News April 17, 2025

అమరావతిలో శాశ్వత సచివాలయానికి టెండర్‌ల విడుదల

image

అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్చిదిద్దే దిశగా సీఎం చంద్రబాబు సర్కార్ కీలక అడుగు వేసింది. నాలుగు సచివాలయ టవర్‌లు, ఒక హెచ్‌వోడీ టవర్‌ నిర్మాణానికి సంబంధించిన రూ.4,668 కోట్ల విలువైన టెండర్‌లను సీఆర్డీఏ విడుదల చేసింది. మే 1న టెక్నికల్ బిడ్లను పరిశీలించి, తుది కాంట్రాక్టర్‌లను ఎంపిక చేయనున్నారు. మే 2న అమరావతికి ప్రధాని మోదీ రానుండటంతో, నిర్మాణాలపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వేగం కనిపిస్తోంది. 

error: Content is protected !!