News March 26, 2025
ఉగాది రోజు సన్నబియ్యం పథకం ప్రారంభం: మంత్రి ఉత్తమ్

ఉగాది రోజున సన్నబియ్యం పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్కార్డుదారులకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సన్నబియ్యంపై సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. సన్నబియ్యం స్కీమ్తో 84 శాతం మంది పేదలు లబ్ధి పొందనున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
జగిత్యాల: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కేంద్రాల పరిశీలన

జవహర్ నవోదయ విద్యాలయం 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన అర్హత పరీక్ష సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము శనివారం పరిశీలించారు. ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల, గోవిందుపల్లిలోని గౌతమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వసతులు, పరీక్ష ఏర్పాట్లు, హాజరు శాతం, ఇన్విజిలేటర్ల సన్నద్ధతను పరిశీలించి పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు.
News December 13, 2025
ఇండియాకు కోహ్లీ.. మెస్సీని కలవడానికేనా?

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు చేరుకున్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్పోర్టులో కనిపించారు. ‘గోట్ టూర్’లో భాగంగా భారత్లో ఉన్న మెస్సీని కోహ్లీ కలుస్తారని ప్రచారం జరుగుతోంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్ను మెస్సీ కలవనున్నారు. ఈ సమయంలోనే ఇద్దరు దిగ్గజాలు మీట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ <<18500552>>లండన్<<>>కు వెళ్లడం తెలిసిందే.
News December 13, 2025
పంచాయతీ ఎన్నికలకు 1500 మంది పోలీసు భద్రత

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 1500 మంది పోలీసులతో భద్రతా ఉంటుందని, 1392 పోలింగ్ కేంద్రాల్లో సాధారణ 878, సమస్యాత్మక 179, అతి సమస్యాత్మక 285, మావోయిస్టు ప్రభావిత కేంద్రాలు 50 గుర్తించామన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలన్నారు.


