News March 26, 2025
ఉగాది రోజు సన్నబియ్యం పథకం ప్రారంభం: మంత్రి ఉత్తమ్

ఉగాది రోజున సన్నబియ్యం పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్కార్డుదారులకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సన్నబియ్యంపై సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. సన్నబియ్యం స్కీమ్తో 84 శాతం మంది పేదలు లబ్ధి పొందనున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.
News November 13, 2025
స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.
News November 13, 2025
Way2News ఎఫెక్ట్.. రూ.4.5 కోట్ల స్కాంపై ఎంక్వయిరీ

కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో రూ.4.5కోట్ల స్కాం అంటూ <<18192226>>Way2Newsలో కథనం<<>> ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ విచారణ చేపట్టింది. నేడు హాస్పిటల్ చేరుకున్న విచారణ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ విభాగాల్లో క్షేత్రస్థాయిలో నిషితంగా ఆడిట్ నిర్వహిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, బిల్స్, రిసిప్ట్లపై సంబంధిత సిబ్బందిని ప్రశ్నిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.


