News February 8, 2025
ఉచిత శిక్షణ.. ఆపై ఉద్యోగం

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని సంస్థ డైరెక్టర్ లక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ), కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, టూ-వీలర్ సర్వీసింగ్, సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.
Similar News
News April 14, 2026
40 నిమిషాల పాటు మోదీ-ట్రంప్ ఫోన్ కాల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్ కాల్లో 40 నిమిషాల పాటు మాట్లాడారు. US-ఇరాన్ సీజ్ఫైర్ ప్రకటించాక వీరిద్దరూ కాల్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలోని పరిస్థితులు సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించారు. హార్ముజ్ భద్రతపైన కూడా చర్చించినట్లు ప్రధాని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
News April 14, 2026
HYDలో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న భారీ మోసాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్న ‘ట్రివియల్ చాప్టర్’ సంస్థకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్రకటనలు, నకిలీ ఆఫర్ లెటర్లతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు
News April 14, 2026
జనగణనను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

జనగణన 2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్-ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకోవచ్చన్నారు. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన అధికారిక వెబ్సైట్ https://se.census.gov.in ద్వారా సులభంగా నమోదుచేసుకోవచ్చన్నారు.


