News March 23, 2025

ఉచిత సామూహిక వివాహాలు: రఘువీరా రెడ్డి

image

మడకశిర మండల పరిధిలోని నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సామూహిక ఉచిత వివాహాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీలోపు నీలకంఠాపురంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మహిళలకు 18, పురుషులకు 21సంవత్సరాల వయసు నిండినట్లు ఆధారాలను అందజేయాలన్నారు. శాస్త్రోక్తంగా వివాహాలు నిర్వహిస్తామని రఘువీరారెడ్డి తెలిపారు.

Similar News

News October 25, 2025

శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పిక్నిక్ ప్రదేశాలు ఇవే..

image

శ్రీకాకుళం జిల్లాలో కార్తీక వనభోజనాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నాలుగు ఆదివారాలు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పిక్నిక్‌లు జరుపుకోనున్నారు. మన జిల్లాలో వంశధారా, నాగావళి నదీ తీరాలు, కలింగపట్నం, బౌద్ధ శిల్పాలు, బారువా బీచ్, టెలినీలపురం, మణిభద్రపురం కొండప్రాంతాలు పిక్నిక్ జరుపుకొనే ప్రాంతాలుగా ప్రసిద్ధి పొందినవి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

News October 25, 2025

జగనామ జిల్లాలో కాకతీయ అనంతర శైలి శిల్పాలు!

image

జగనామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామ దేవతా ఆలయ రిజర్వాయర్‌ వద్ద రాష్ట్రకూట, కాకతీయ అనంతర శైలికి చెందిన నాగుల శిల్పాలు, శిథిల శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ శివలింగం పట్టుకున్న వీరుడు, నక్క వాహనం కలిగిన శిథిల చాముండి శిల్పం కూడా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మీ గ్రామంలో కూడా ఇలా చరిత్ర కలిగిన దేవాలయాలు, శిల్పాలు ఉంటే కామెంట్ చేయండి.

News October 25, 2025

విశాఖ: చెంబులో డబ్బులేస్తే రెట్టింపు అవుతాయని మోసం

image

తమ వద్ద ఉన్న రూ.30 కోట్ల విలువైన చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని డాక్టర్‌ను మోసగించిన కేటుగాళ్లను ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. HYDకి చెందిన డా. ప్రియాంక వద్ద రైస్ పుల్లింగ్ పేరుతో అరకు చెందిన కొర్రా బంగార్రాజు, పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్ రూ.1.70కోట్లు కాజేశారు. 6 నెలలైనా వారి నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా వారిని అరెస్టు చేశామని ACP నరసింహమూర్తి తెలిపారు.