News March 15, 2025
ఉచిత DSC శిక్షణకు నేడే తుది గడువు

తిరుపతి జిల్లాలో SC, ST అభ్యర్థులకు ఉచిత DSC కోచింగ్ కోసం దరఖాస్తులకు నేటి(శనివారం) వరకు అవకాశం ఉన్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిని పరిగణలోకి తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. వారితో పాటూ బీసీలకు కూడా అవకాశం ఉందని బీసీ వెల్ఫేర్ అధికారి జోత్స్న తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.
Similar News
News March 16, 2025
ఈ నెల 18న ఢిల్లీకి చంద్రబాబు!

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని ఆయనను ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
News March 16, 2025
కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం తెలిపారు. ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్తో పరీక్షలకు పంపితే, ఆ పాఠశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News March 16, 2025
జిల్లా అధికారులను అభినందించిన జనగామ కలెక్టర్

స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను జిల్లా అధికారులందరినీ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అభినదించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు గత వారం రోజులుగా నిర్విరామంగా విశేష కృషి చేశారని కలెక్టర్ అన్నారు. అందరి సమన్వయ కృషి వల్లే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.