News October 14, 2024
ఉజ్బెకిస్థాన్లో హుజురాబాద్ అధ్యాపకుడి ప్రసంగం

ఉజ్బెకిస్థాన్ దేశంలోని తాష్కెంట్ అల్ఫ్రాగానస్ యూనివర్సిటీలో శనివారం జరిగిన యునెస్కో ఆసియా పసిఫిక్ వ్యవస్థాపక విద్యాసదస్సులో హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా.మల్లారెడ్డి భారతదేశం తరఫున పాల్గొని ప్రసంగించారు. 21వ శతాబ్దంలో యువత ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను అధిగమించే విద్యావిధానాల గురించి వివరించారు. కార్యక్రమంలో 40 దేశాల నుంచి 200 ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News October 31, 2025
KNR: మైనారిటీ గురుకులాల్లో లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు

జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కరీంనగర్, మానకొండూర్, జమ్మికుంట గురుకులాల్లోని ఈ పోస్టులకు PG, B.Ed అర్హత ఉన్నవారు నవంబర్ 6వ తేదీ లోగా కరీంనగర్ జిల్లా మైనారిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
News October 31, 2025
KNR: ‘విజిలెన్స్ మనందరి సంయుక్త బాధ్యత’

ఆర్టీసీలో OCT 28 నుంచి NOV 2 వరకు నిర్వహించుచున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా KNR బస్టాండ్ ఆవరణలో KNR RM బి.రాజు, జోనల్ విజిలెన్స్ & సెక్యూరిటీ అధికారి ఎం.రవీందర్, డిప్యూటీ RMలు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం సిబ్బందితో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేయించారు. RM మాట్లాడుతూ.. విజిలెన్స్ మనందరి సంయుక్త బాధ్యత అన్నారు. ప్రతి ఉద్యోగి విధుల్లో నిజాయితీ, నిబద్ధత కలిగిన సంస్కృతిని పెంపొందిస్తామన్నారు.
News October 31, 2025
KNR: SRR కళాశాలలో ఉపన్యాస కార్యక్రమం

KNR SRR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం డిగ్రీ, PG విద్యార్థులకు లైకెన్లపై విస్తృత ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. లైకెన్ల ఆవిర్భావం, లైకెన్ల ప్రాముఖ్యత, అవి కాలుష్య సూచికలగా ఎలా ఉపయోగపడతాయో శ్రీనివాస్ విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.


