News March 19, 2025

ఉట్నూర్: యాక్సిడెంట్.. ఒకరి దుర్మరణం

image

ఉట్నూర్ మండలం ఘన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జైనూర్ మండలం గూడ మామడ గ్రామానికి చెందిన కుమ్రా భక్కు‌ను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గౌరు అనే మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా బైక్‌ను ఢీ కొన్న చిచ్‌దరి ఖానాపూర్‌కు చెందిన వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడన్నారు.

Similar News

News March 19, 2025

ADB: 20న కందులు, శనగల కొనుగోళ్లు బంద్

image

కందులు, శనగలు కొనుగోళ్లను ఈనెల 20న నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ సెంటర్ ఇన్‌ఛార్జ్ కేంద్రే పండరి బుధవారం తెలిపారు. కందులు, శనగల నిల్వలు అధికంగా ఉన్నందున కొనుగోళ్లు  జరగవన్నారు. ఈనెల 21 నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

News March 19, 2025

తాంసి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

తాంసి మండల కేంద్రానికి చెందిన కనాకే ప్రసాద్(42) చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు.. తాంసికి చెందిన ప్రసాద్‌కు హోలీన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రసాద్ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు.

News March 19, 2025

రాష్ట్ర బడ్జెట్‌పై ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశలు

image

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ADB జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఉట్నూర్ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా, జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్, స్పిన్నింగ్ వద్ద ఫ్లైఓవర్ పనులకు, చనాక-కొరాట ప్రాజెక్ట్, కుంటాల, పొచ్చర జలపాతాల వద్ద అభివృద్ధి, పర్యాటక రంగానికి, పురాతన ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

error: Content is protected !!