News March 25, 2024

ఉత్కంఠ రేపుతున్న మహిధర్ రెడ్డి మౌనం

image

YCP టిక్కెట్ చేజారిన నేపథ్యంలో కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. BJP.. లేదా TDP అభ్యర్ధిగా పోటీ చేసి YCPకి ఝలక్ ఇస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటు YCPకి మద్దతూ తెలపలేదు. MP అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరినప్పటికీ నిర్ణయం మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.

Similar News

News April 21, 2025

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డీఎస్సీ ద్వారా<<16156012>> 629 పోస్టులు<<>> భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-259 ➤ BC-A:44 ➤ BC-B:58
➤ BC-C:08 ➤ BC-D:46 ➤ BC-E:25
➤ SC- గ్రేడ్1:08 ➤ SC-గ్రేడ్2:38.
➤ SC-గ్రేడ్3:48 ➤ ST:33 ➤ EWS: 61
➤ PHC-HH:1

News April 21, 2025

ప్రకాశం: పుట్టింటి నుంచి ఆలస్యంగా వచ్చిందని.!

image

పేర్నమిట్టలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పేర్నమెట్టకు చెందిన నవీన్.. భార్య శ్రావణి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆమె పుట్టినిల్లు అయిన జమ్ములపాలెంకు వెళ్లింది. అదే రోజు రమ్మని నవీన్ కోరగా ఆమె మరుసటి రోజు వచ్చింది. దీంతో అనుమానం పెంచుకున్న నవీన్ ఆదివారం ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కడంతో ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2025

బేస్తవారిపేట: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

image

బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పెద్ద ఓబులేనిపల్లికి చెందిన ఆకాశ్, సన్నీగా గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

error: Content is protected !!