News March 25, 2024
ఉత్కంఠ రేపుతున్న మహిధర్ రెడ్డి మౌనం

YCP టిక్కెట్ చేజారిన నేపథ్యంలో కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. BJP.. లేదా TDP అభ్యర్ధిగా పోటీ చేసి YCPకి ఝలక్ ఇస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటు YCPకి మద్దతూ తెలపలేదు. MP అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరినప్పటికీ నిర్ణయం మాత్రం సస్పెన్స్గానే ఉంది.
Similar News
News October 14, 2025
‘ప్రకాశం జిల్లాలో బెల్ట్ షాపుల విక్రయాలు అరికట్టండి’

ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను అరికట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమై కలెక్టర్ చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలన్నారు.
News October 14, 2025
ప్రకాశం: ‘ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలి’

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరిస్తూ ఏర్పాటుచేసిన గోడ పత్రికను కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చేతుల పరిశుభ్రతతో ఎన్నో వ్యాధులు దరిచేరవని అన్నారు.
News October 13, 2025
కొనకనమిట్ల వద్ద ప్రమాదం.. మరో ఇద్దరు స్పాట్డెడ్.!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం ఎదురురాళ్లపాడు గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా CSపురం వద్ద <<17997659>>గంటక్రితం ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే.