News December 11, 2024

ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం: స్పీకర్

image

ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. బుధవారం ఎంసీఆర్‌‌హెచ్‌ఆర్‌‌డీఐలో జరిగిన శాసన మండలి, శాసన సభ సభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు, వైఎస్సార్ వంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి గొప్ప పేరు తెచ్చుకున్నారని తెలిపారు.

Similar News

News October 18, 2025

HYD: జిమ్‌లలో ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ దుర్వినియోగంపై చర్యలు

image

సికింద్రాబాద్‌లోని నామాలగుండులో అక్రమంగా నిల్వచేసి విక్రయించిన ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్’ నిల్వలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎం.నరేశ్ అనే మెడికల్ వ్యాపారి నుంచి గుండె ఉద్దీపన మందులు-టెర్మిన్ ఇంజెక్షన్లు, టెర్మివా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. బాడీబిల్డింగ్‌లో దుర్వినియోగం కోసం ఈ మందులను జిమ్‌కు వెళ్లేవారికి చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారు.

News October 18, 2025

HYD: నవీన్ యాదవ్‌ ఆస్తులు రూ.29.66 కోట్లు

image

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నామినేషన్‌తోపాటు తన అఫిడవిట్ దాఖలు చేశారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు, రూ.5.75 కోట్లు భార్య పేరిట ఉన్నాయన్నారు. తనకు అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. తనపై 7 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా వెల్లడించారు. 18.69 ఎకరాల వ్యవసాయ భూమి, యూసుఫ్‌గూడలో 860 గజాల ఇంటి స్థలం ఉందన్నారు.

News October 18, 2025

HYD: సంపులో పడి చిన్నారి మృతి.. జర జాగ్రత్త..!

image

HYD నానక్ రాంగూడలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీఎన్జఓ కాలనీలో ఉండే పరమేశ్వర్, సంధ్యారాణి దంపతులకు కుమారుడు నిఖిల్ తేజ(4) ఉన్నాడు. ఈ క్రమంలో అంగన్‌వాడికి వెళ్లిన నిఖిల్ పక్కనే ఉన్న సంపులో ఆడుతూ పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కొద్దిసేపు తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో సంపులో మృతదేహం లభించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.