News December 19, 2024
ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న కర్నూలు ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734535635396_50589886-normal-WIFI.webp)
కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్కు ఉత్తమ ప్రశంసా పత్రం లభించింది. డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా ఆయన ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. లోక్ అదాలత్లో 7,913 కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే కర్నూలు పోలీస్ శాఖను మొదటి స్థానంలో నిలపడంతో ఎస్పీని డీజీపీ తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News January 20, 2025
ఏపీ ఖజానా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా చంద్ర శేఖర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737289699905_50015707-normal-WIFI.webp)
ఆంధ్రప్రదేశ్ ఖజానా, లెక్కల సర్వీసెస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నికలను ఆదివారం జిల్లా ఖజానా కార్యాలయంలో నిర్వహించారు. అసోసియేషన్ ఎన్నికల అధికారి ప్రభు దాస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హెచ్.చంద్ర శేఖర్ (సీనియర్ అకౌంటెంట్), జిల్లా కార్యదర్శిగా వై.శ్రీనివాస రాజు (సీనియర్ అకౌంటెంట్), తదితర సభ్యులను ఎన్నుకున్నారు.
News January 19, 2025
సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తా: టీజీ వెంకటేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737295762829_50299483-normal-WIFI.webp)
నాయి బ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం కర్నూలులో జరిగిన శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాలను కేఎంసీ కమిషనర్ రవీంద్రబాబు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సదాశివతో కలిసి టీజీ వెంకటేశ్ ప్రారంభించారు. నాయి బ్రాహ్మణ కులవృత్తి మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు.
News January 19, 2025
‘రాయలసీమ వనరుల వినియోగానికి సహకరించండి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737290194879_60244771-normal-WIFI.webp)
రాయలసీమ వనరుల వినియోగానికి కూటమి ప్రభుత్వం సహకరించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.