News July 11, 2024

ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు: చంద్రబాబు

image

పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం దార్లపూడి పోలవరం ఎడమ ప్రధాన కాలువ వద్ద ప్రజల ఉద్దేశించి సీఎం మాట్లాడారు. గతంలో తాను 72% పోలవరం పనులు పూర్తిచేస్తే, వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక శాతం పనులు కూడా చేపట్టలేదని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు పోలవరం ఒక వరం అన్నారు.

Similar News

News December 8, 2025

జీవీఎంసీలో అడ్డగోలు ప్రతిపాదనలు వెనక్కి..!

image

జీవీఎంసీలో అభివృద్ధి పనులపై 287 అంశాలకు గాను 34 అంశాలను స్థాయి సంఘం ఆమోదం తెలపకూండా శనివారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు ఆమోదం విషయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారంటూ స్థాయి సంఘం సభ్యులపై వార్తలు రావడంతోనే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చర్చ సమయంలో కొందరు అధికారుల తప్పిదాలకు తాము విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని స్థాయి సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసు సైతం వ్యాఖ్యానించారు.

News December 8, 2025

విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

image

ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పై అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారని 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.

News December 8, 2025

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్‌లో కూరగాయలు

image

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు లభ్యమవుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ చేస్తున్నారు. మాచింట్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ https://digirythubazaarap.com వెబ్సైట్ ద్వారా 5 రోజులుగా 150 మందికి డెలివరీ చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చార్జీలు లేవు.