News December 31, 2024

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా విడుదల

image

ఉమ్మడి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదాను ఎన్నికల అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. శ్రీకాకుళం విజయనగరం, మన్యం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలో 21,555 ఓటర్లులో ఉన్నట్టు ముసాయిదాలో ప్రకటించారు. ఈ ముసాయిదాను వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ జాబితాను వివిధ రాజకీయ పార్టీలకు అందజేయనున్నారు.

Similar News

News November 24, 2025

విశాఖ తీరంలో విషాదం.. మరో మృతదేహం లభ్యం

image

విశాఖ లైట్ హౌస్ బీచ్‌లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఘటన విషాదాంతమైంది. ఆదివారం తేజేశ్ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం ఆదిత్య మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. సముద్ర స్నానానికి దిగి అలల ధాటికి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News November 24, 2025

బిజీబిజీగా విశాఖ పోలీసుల షెడ్యూల్

image

విశాఖలో పోలీసు యంత్రాంగం బిజీ బిజీ షెడ్యూల్‌తో విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం CII సమ్మెట్ సభలును విజయవంతంగా విధులు నిర్వహించిన‌ పోలీసులకు వరుసగా మూడు కార్యక్రమాలు జరగనున్నడంతో సవాల్‌గా మారింది. కనకమాలక్ష్మి దేవస్థానం పండుగ ఉత్సవాలు. మేరీ మాత ఉత్సవాలు, ఇండియా-సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలుతో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

News November 24, 2025

విశాఖ: ప్రియరాలితో వాగ్వాదం.. ప్రియుడి ఆత్మహత్య

image

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో నిన్న రాత్రి వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన రాజేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.