News February 13, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLC బరిలో 10 మంది

ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు.
Similar News
News October 20, 2025
KNR: దీపావళి.. ఈ PRECAUTIONS మస్ట్..!

దీపావళి పండగ సందర్భంగా పటాకులు కాల్చే సమయంలో ప్రజలు కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలని ఆయా జిల్లాల అధికారులు సూచిస్తున్నారు.
* టపాసులు కాల్చే టైంలో కాటన్ దుస్తులు ధరించాలి.
* ముఖం దగ్గరగా పెట్టి టపాసులు పేల్చవద్దు.
* మీ పిల్లల పక్కన మీరు విధిగా ఉండండి.
* పేలని టపాసులను మళ్లీ కాల్చడానికి ప్రయత్నించకండి.
* బయట నీటి బకెట్లు పెట్టుకోండి.
* ఎమర్జెన్సీలో దగ్గర్లోని క్లినిక్లకు వెళ్లండి.
SHARE IT.
News October 20, 2025
జనగామ: నందన్ ఫంక్షన్ హాల్లో మద్యం టెండర్ల లక్కీ డ్రా

మద్యం టెండర్ల గడువు పొడిగించడంతో జనగామ జిల్లాలో మద్యం టెండర్లకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ అవకాశం కల్పించింది. అయితే ఈ టెండర్లను లక్కీ డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. జనగామ శివారులోని నందన్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీయనున్నారు.
News October 20, 2025
వంటింటి చిట్కాలు

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.