News September 24, 2024
ఉత్తరాంధ్ర రైల్వే డివిజన్ ఛైర్మన్గా కేంద్రమంత్రి

విశాఖపట్నంలో జరిగిన రైల్వే వాల్తేర్ డీఆర్ఎం సమావేశంలో ఉత్తరాంధ్ర రైల్వే అభివృద్ధి పనులపై చర్చించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం-సికింద్రాబాద్ తిరుపతికి కొత్త రైళ్లను, రోజువారి ప్రయాణికుల కోసం శ్రీకాకుళం-విశాఖను కలిపే నమో-భారత్ సర్వీసును ప్రారంభించాలని అధికారులను కేంద్రమంత్రి కోరారు. డివిజన్ ఛైర్మన్గా ఎంపిక చేసినందకుకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 4, 2025
ఈనెల 7న NMMS ప్రతిభా పరీక్ష: DEO

ఈనెల 7న NMMS ప్రతిభ పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్లలోని 25 కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 5,627 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని కోరారు.
News December 4, 2025
SKLM: ‘ఆలయాల్లో దొంగతనాలు చేసిన ముగ్గురి అరెస్ట్’

జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,71,000 స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఈ ముగ్గురూ గతంలో ఆముదాలవలసలో మోటార్ బైకుల దొంగతనం కేసులో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు కూడా డీఎస్పీ వెల్లడించారు.
News December 4, 2025
శ్రీకాకుళం: ‘గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు’

ప్రభుత్వం గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. గ్రామ సచివాలయాల అడ్మినిస్ట్రేషన్కు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ ) వ్యవస్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం రాష్ట్రం యూనిట్ను వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ భాగం ఏర్పాటు చేశారు. డీడీఓగా అరుంధతి దేవిని నియమించారు. జిల్లాలో 657 గ్రామ సచివాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి.


