News July 8, 2024

ఉత్తరాంధ్ర లయన్స్‌పై రాయలసీమ కింగ్స్ విజయం

image

విశాఖ వైఎస్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం ఏపీఎల్ సీజన్-3 మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్- రాయలసీమ కింగ్స్ జట్లు తలబడ్డాయి. ఆరు వికెట్ల తేడాతో రాయలసీమ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత రాయలసీమ కింగ్స్ 17.3 ఓవర్లలో ఆరు వికెట్ల ఆదిక్యంతో 122 పరుగులు చేసి గెలుపొందింది.

Similar News

News February 12, 2025

విశాఖ: వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష

image

కేంద్ర పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కేంద్ర బృందం డాక్టర్ పాదాలు, రమణ మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది, అధికారుల పని తీరు సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి సిబ్బంది హాజరును పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో DMHO జగదీశ్వరరావు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.

News February 11, 2025

షీలానగర్-పోర్టు రోడ్డులో యాక్సిడెంట్ 

image

షీలానగర్-పోర్టు రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాకకు చెందిన ఎం.నరసింహారావు సైకిల్‌పై టీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం టీ పట్టుకొని వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు.

News February 11, 2025

విశాఖ: పదో తరగతి పరీక్షకు 29,997 మంది

image

విశాఖలో మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒక‌టో తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి సీతారామారావు ఆదేశించారు.మంగళవారం ఆయన అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు.విశాఖలో 134 కేంద్రాల్లో రెగ్యుల‌ర్ విద్యార్థులు 28,523, ఓపెన్ విద్యార్థులు 1,404 మొత్తం 29,997 మంది హాజ‌ర‌వుతున్నార‌ని డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు.

error: Content is protected !!